సిద్దిపేట: రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో బీసీల రిజర్వేషన్, మున్నూరు కాపుల జనాభాను తగ్గించి చూపెట్టారని కాపు కులస్తులు డిమాండ్ చేశారు.బీసీల రిజర్వేషన్ రీసర్వే చేయాలని రాష్ట్ర మున్నూరు కాపు పిలుపుమేరకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి కార్యక్రమంలో భాగంగా ముందస్తుగా హుస్నాబాద్ పోలీసులు హుస్నాబాద్ మున్నూరు కాపు కులస్తులను అరెస్టు చేశారు.