AP: కోళ్లు మృతిపై మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోళ్లు మృతిపై పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో చర్చించారు. క్షేత్రస్థాయిలో వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండాలని.. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ల్యాబ్కు పంపాలని ఆదేశించారు.