CTR: కుప్పం మున్సిపల్ పరిధిలోని మోడల్ కాలనీలో డీఎస్పీ పార్థసారథి పర్యవేక్షణలో ఆదివారం తనిఖీలు నిర్వహించారు. సుమారు 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. అనుమానితులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. అనుమానితులకు ఇళ్లను అద్దెకు ఇవ్వరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.