TPT: సూళ్లూరుపేట మండలంలోని కోరిడి గ్రామంలో బస్టాండ్ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. పైకప్పు దెబ్బతినడం, గోడలు కూలిపోవడం వల్ల ప్రయాణికులు అక్కడ నిలబడేందుకు కూడా భయపడుతున్నారు. వర్షం, ఎండ నుంచి రక్షణ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ చుట్టూ చెత్త పేరుకుపోయి, మొక్కలు పెరిగి అపరిశుభ్రంగా మారిందని విమర్శలు వస్తున్నాయి.