VZM: కృష్ణా జిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం జరిగిన రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో నిర్వహించిన జావెలిన్ త్రోలో ఎస్ కోట వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి బంగారు పతకం కైవసం చేసుకున్నారు. అలాగే జిల్లాకు చెందిన 50 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు క్రీడాకారులను అభినందించారు.