PPM: కలక్టరేట్లో ఈ నెల 28న ప్రభుత్వ ఉద్యోగులు,విశ్రాంత ఉద్యోగుల కొరకు ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 11కు గ్రీవెన్స్ ప్రారంభమవుతుందని వెల్లడించారు.