PLD: గత 5 ఏళ్లుగా రివర్స్ టెండరింగ్ పేరుతో నిర్లక్ష్యాన్ని గురైనటువంటి పోలవరం ప్రాజెక్టు మరలా పరిగెడుతుందని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరం అదేవిధంగా విభజిత ఆంధ్రప్రదేశ్కి అమరావతి రెండు కళ్లు వంటివని, గత 5 ఏళ్లలో వాటిని పూర్తిగా సర్వనాశనం చేశారని అన్నారు.