NDL: డోన్ పట్టణంలోని హైవేలో మోటార్ వాహన అధికారి క్రాంతి కుమార్ తనిఖీలు నిర్వహించారు.ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఖమ్మం నుంచి బెంగళూరు వెళ్తుండగా రాష్ట్రానికి కట్టాల్సిన రోడ్ టాక్స్ కట్టకుండా తిరుగుతున్న బస్సుకు రూ.4,43,000ల జరిమానా, వీటితో పాటు పర్మిట్లేని వాహనాలు, ఓవర్ లోడ్తో వెళ్తున్న వాహనాలకు రూ.82,000ల జరిమానా విధించామని డోన్ ఎంవీఐ క్రాంతి కుమార్ తెలిపారు.