ప్రకాశం: పంగులూరు మండలంలోని మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో 38 అర్జీలు వచ్చినట్లు పంగులూరు మండల తహసీల్దార్ సింగారావు తెలిపారు. ముప్పవరం 23, జాగర్లమూడి వారి పాలెం 15 ఇలా మొత్తం 38 అర్జీలు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలపై ఆరా తీశారు. రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.