కృష్ణా: ఉంగుటూరు మండలం మానికొండలో నిన్న ‘రైతన్న మీ కోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్ రావు పాల్గొన్నారు. రైతులను కలసి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. గ్రామ అభివృద్ధికి రూ.3.45 కోట్లు కేటాయించినట్లు, మానికొండ-తరిగొప్పల రోడ్డు పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.