CTR: తవణంపల్లె మండలం అరగొండలోని అర్థగిరి శ్రీవీరాంజనేయ స్వామి దేవస్థానంలో 122 రోజుల తర్వాత గురువారం హుండీ లెక్కింపు జరిగింది. ఇందులో భాగంగా మొత్తం ₹17,35,350 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో మునిశేఖర్ తెలిపారు. కాగా, బంగారం 3.600 మిల్లీగ్రాములు, వెండి 102 గ్రాములు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ శ్వేత, గ్రామీణ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్, గ్రామస్థులు పాల్గొన్నారు.