KDP: తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని శనివారం వేకువ జామున దర్శించుకున్నట్లు పట్టభద్రులు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆయనకి అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామి వారిని దర్శించు కోవడం ఆనందకరంగా ఉందని వెల్లడించారు. తిరుమల లడ్డూపై వివాదంపై నిజాలు త్వరలోనే తెలుస్తాయని చెప్పారు.