VSP: సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్నకు ఆదివారం ఘనంగా స్వర్ణపుష్పార్చన నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతఃకాల పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా గోవిందరాజస్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపం వేదికపై అధిష్టింపజేశారు.