ప్రకాశం: తిరుమల లడ్డూల తయారీలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడడంపై టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు మామిడిపాక హరి ప్రసాదరావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పర్చూరులోని కార్యాలయంలో ఆదివారం మాట్లాడుతూ.. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుమల ఆలయం పవిత్రతను దెబ్బతీసేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు.