NLR: వెంకటగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కురుగొండ్ల రామక్రిష్ణ ఆదివారం మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణని, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కలిసి పోలేరమ్మ జాతరకి రావాలని ఆహ్వానం పలికారు. ఆయన వెంట ఆలయ ఈఓ, జాతర ఉత్సవ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.