CTR: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ముఖ్య మంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఆదివారం ఉదయం చిత్తూరు రూరల్ మండలం పెరుమాళ్ కండ్రిగ పంచాయతీలో జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజలతో మాట్లాడారు.