బాపట్ల: కొరిశపాడు మండలం అనమనమూరు గ్రామంలో శనివారం జరిగిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో అధికారులు ఏకపక్ష ధోరణితో దారుణంగా విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి అధికారులు స్థానిక ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులకు మరియు అధికార పార్టీకి చెందిన వారికి సమాచారం లేకుండా వైసీపీ చెందిన వారితో సభ నిర్వహించటం పట్ల టీడీపి నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.