సత్యసాయి: నల్లచెరువు మండలం బందార్లపల్లిలో హంద్రీనీవా కాలువలో పడి మృతి చెందిన తండ్రీకొడుకుల మృతదేహాలకు వైసీపీ సమన్వయకర్త బీ.యస్ మక్బూల్ నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.30,000 ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మక్బూల్ డిమాండ్ చేశారు.