ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వివిధ గ్రామాల నుంచి పలు సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. అన్ని సమస్యలను ఆయా శాఖల అధికారులకు వివరించి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో పుల్లారావు పేర్కొన్నారు.