TG: హైదరాబాద్ బంజారాహిల్స్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ర్యాపిడో బైక్ను వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హోంగార్డు సయ్యద్ హుస్సేన్, అక్షిత మృతి చెందారు. సంతోష్ నగర్ ట్రాఫిక్ హోంగార్డుగా సయ్యద్ పనిచేస్తున్నారు. ఉద్యోగం తర్వాత పార్ట్ టైంగా ర్యాపిడో డ్రైవర్గా చేస్తున్నారు. ర్యాపిడో కస్టమర్ అక్షిత కూడా ప్రాణాలు కోల్పోయింది.