కృష్ణా: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం దేశ రాజకీయ చరిత్రలో మరువలేని రోజు అని తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం చనుబండ సెంటర్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన రోజున, కార్మికుల కోసం ఎన్టీఆర్ చేసిన సేవలు మరువలేనివని, ఆయన చరిత్రను ఎన్నటికీ మరువలేమని పేర్కొన్నారు.