SRD :జిల్లా వ్యాప్తంగా ‘అరైవ్ అలైవ్ – 2026’ పేరుతో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలను చైతన్య పరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఏకాగ్రత కోల్పోయి తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.