MNCL: జిల్లాలో తరచూ ప్రమాదాలు జరిగే స్థలాలను గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్నామని DCP భాస్కర్ శనివారం ప్రకటనలో తెలిపారు. వాహనదారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, అతి వేగంగా, మద్యం మత్తులో, నిద్రలేమితో, నిర్లక్ష్యంగా వాహనాలు నడపవద్దని సూచించారు. ఈ ప్రమాదాలకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.