PDPL: శాంతినగర్ లోని శ్రీ కోదండ రామాలయంలో కలెక్టర్ శ్రీ హర్ష దంపతులు ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ నూగిళ్ల మల్లయ్య, కౌన్సిలర్ శైలజ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.