VSP: నగరంలో రూ.30 లక్షల విలువైన రెస్టారెంట్ సామగ్రి చోరీకి గురైన ఘటనలో అనకాపల్లి జిల్లాకు చెందిన ఒక కానిస్టేబుల్పై విశాఖ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సదరు కానిస్టేబుల్ను ఐదవ నిందితుడు (A-5)గా చేర్చారు. చోరీకి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్న పోలీసులు, దీనిపై లోతైన విచారణ జరుపుతున్నారు.