NGKL: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్కు రేపు శుక్రవారం సెలవు ప్రకటించినట్లు కార్యదర్శి శివరాజ్ తెలిపారు. వేరుశనగ, మొక్కజొన్న, కందులు ఇతర ధాన్యాన్ని అమ్మేందుకు తెచ్చే రైతులు గమనించాలని ఆయన కోరారు. తిరిగి వ్యవసాయ మార్కెట్ శనివారం యథావిధిగా మార్కెట్ కొనసాగుతుందని ఆయన అన్నారు. రైతులు సహకరించాలని కోరారు.