సత్యసాయి: ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ కాలువ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. మంత్రి సత్య కుమార్ ఆదేశాల మేరకు గురువారం 4వ మాస్టర్ తనిఖీలో మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్తపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద ఉన్న కాలువ పనులను వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు.