VKB: పెట్రోల్ బంకుల యజమానులకు ధారూర్ ఎస్సై రాఘవేందర్ హెచ్చరికలు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ధారూర్ లోని పెట్రోల్ బంకులకు వచ్చే వారికి వాహనాల్లో మాత్రమే పెట్రోల్ పోయాలని, వాటర్ బాటిల్స్ ఇతర డబ్బాలలో పోయకూడదని సూచించారు. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ విషయంలో ప్రజలను భయపెట్టే విధంగా అపోహాలు కల్పించవద్దని సూచించారు.