ప్రకాశం: పామూరు మండలం అనుములకొండ గ్రామ శివారులో పేకాట శిబిరాలపై ఎస్సై అనుక్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.21,300 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో ఎక్కడైనా పేకాట, జూదం వంటివి నిర్వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.