NLR: గుడ్లూరు మండలం సాలిపేట-రావూరు మార్గంలో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. చేవూరుకు చెందిన సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. బుధవారం ఎస్ఐ వెంకట్రావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్కూల్ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం చేయరాదని సూచించారు.