JGL: పెగడపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎంపీడీవో శశికుమార్ రెడ్డి ఆదేశించారు. వేసవి దృష్ట్యా మొక్కలు ఎండిపోకుండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా నిత్యం నీరు అందించాలని చెప్పారు. ఎక్కడైనా నిర్లక్ష్యం వల్ల మొక్కలు ఎండిపోతే సంబంధిత పంచాయతీ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.