అన్నమయ్య: పీలేరు మేజర్ పంచాయతీలో నేడు వేలం నిర్వహిస్తున్నట్లు ఈవో బ్రాహ్మానందరెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి వేలం ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. వారపు సంత, దినసరి కూరగాయల మార్కెట్, షాపింగ్ కాంప్లెక్స్ను వేలం వేయనున్నట్లు తెలిపారు. వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.