AP: రాయలసీమ ఎత్తిపోతలను సీఎం చంద్రబాబు ఆపేయడం దుర్మార్గమని మాజీ మంత్రి శైలజానాధ్ మండిపడ్డారు. జగన్ రూ.900 కోట్లతో 90 శాతం పనులను పూర్తి చేశారని తెలిపారు. మిగతా పనులు చేయకుండా చంద్రబాబు అన్యాయం చేశారని ఆరోపించారు. పోలవరంలో వంద టీఎంసీల కంటే తక్కువ నీటిని నిల్వ చేస్తున్నారని.. రాష్ట్రమంతటా నీటి కొరత ఏర్పడబోతోందని జోస్యం చెప్పారు.