SDPT: కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామంలో ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ర్యాలీ, మానవహారం ద్వారా నీటి సంరక్షణపై నినాదాలు చేశారు. నీటిని పొదుపుగా వినియోగించాలని సర్పంచ్ బోయిని సంపత్ సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.