GDWL: ఐకేపీ వీవోఏల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 25న ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా నేతలు డ్యాం అంజి, తిమ్మప్ప శనివారం జిల్లా కేంద్రంలో పిలుపునిచ్చారు. సమావేశంలో వారు మాట్లాడుతూ.. నెలకు రూ.20 వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు దానిని నెరవేర్చలేదని విమర్శించారు. వీవోఏలు అందరూ తరలిరావాలని కోరారు.