అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి వద్ద ఇవాళ సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుడ్డారెడ్డిగారిపల్లి సమీపంలో కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో పాలెం గడ్డ హరిజనవాడకు చెందిన నాగబాబు తీవ్రంగా గాయపడ్డాడు. స్థనికులు అతన్ని వెంటనే రాయచోటి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు సంబేపల్లి ఎస్సై రవికుమార్ తెలిపారు.