BDK: భద్రాచలం విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అధికారులు శనివారం తెలిపారు. ఐటీడీఏ రోడ్డు, మెడికల్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, రాజీవ్ నగర్ కాలనీ, ఆదర్శనగర్ కాలనీ, సుందరయ్య నగర్ కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ ప్రాంతాల్లో పవర్ ఉండదన్నారు. వినియోగదారులు గమనించి సహాకరించాలన్నారు.