CTR: నగరి మున్సిపాలిటీ పుదుపేటలో జరిగిన రంజాన్ వేడుకల్లో మాజీ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలుపుతూ.. రంజాన్ నెలలో పాటించే ఉపవాస దీక్షలు, ప్రార్థనలు మనిషిలో సహనం, దాతృత్వం, ఐక్యతను పెంపొందిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.