AP: విదేశాలకు ఎగుమతి చేసేందుకు అక్రమంగా తరలిస్తున్న 140 మెట్రిక్ టన్నుల PDS బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. కాకినాడ యాంకరేజ్ పోర్టుకు 5 లారీల్లో తరలిస్తుండగా.. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సత్యనారాయణ బృందం దాడులు చేసి, బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా పట్టుబడిన బియ్యం విలువ సుమారు రూ.65 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.