SRCL: రాష్ట్ర బడ్జెట్ సవరించి విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీరాముల సంజన అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కు నిరసనగా బడ్జెట్ ప్రతులను సిరిసిల్లలో వారు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సంజన మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు విద్యా రంగానికి 15 శాతం బడ్జెట్ ఇస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని తుంగలో తొక్కిందన్నారు.