కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు, రామచంద్రాపురం ఇంఛార్జ్ డీఎస్పీ TSRK ప్రసాద్ శనివారం ద్రాక్షారామం పరిధిలోని ఆదివారపుపేట, YSR కాలనీల్లో భారీ ‘కార్డన్ సెర్చ్’ నిర్వహించారు. ప్రతి ఇంటిని కూలంకషంగా తనిఖీ చేశారు. గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయం, వాడకం చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడివారికి హెచ్చరించారు.