ప్రకాశం: వైసీపీ అభివృద్ధి కోసం నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని కనిగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం కనిగిరి పార్టీ కార్యాలయంలో పీసీపల్లి మండల నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, పెదచెర్లోపల్లి గ్రామ కమిటీ నియామక పత్రాలను అందజేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఆయన సూచించారు.