ELR: టి.నర్సాపురం మండలంలోని పలు గ్రామాల్లో ఇవాళ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు దాడులు నిర్వహించారు. తిరుమలదేవిపేటలో అనగాని రాంబాబు, బొల్లం రామకృష్ణల వద్ద విక్రయిస్తున్న కల్లును రసాయన పరీక్షల నిమిత్తం సేకరించారు. అనంతరం టి.నర్సాపురంలోని మద్యం దుకాణాల్లో నిల్వలను తనిఖీ చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై జె.జగ్గారావు, సిబ్బంది పాల్గొన్నారు.