KDP: ఆంధ్ర జెస్యూట్ ప్రావిన్స్ ప్రొవిన్షియల్ ఆర్.జాన్ ఇవాళ పులివెందులలోని లయోలా డిగ్రీ కళాశాలను సందర్శించారు. 30 అధునాతన కంప్యూటర్లతో ఏర్పాటు చేసిన క్వాంటం టెక్నాలజీ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. అనంతరం కళాశాలలోని మూడు మ్యూజియంలను సందర్శించి, అక్కడ భద్రపరిచిన అరుదైన చారిత్రక వస్తువులను ఆసక్తిగా పరిశీలించారు.