NLG: నల్గొండ మండలం అప్పాజీపేటలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం పర్యటించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కాలువలను స్వయంగా పరిశీలించి, రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొండపాకగూడెం నుంచి అప్పాజీపేట వరకు నిర్మించే పిల్ల కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గం లోని ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేయడమే తన ధ్యేయమన్నారు.