JN: సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం చెందిన నర్మెట్ట గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు ఉత్సవాల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. జిల్లాలోని 12 మండలాల నుండి 39 ప్రత్యేక ఆర్టీసీ బస్సులలో రైతులు ఈ కార్యక్రమంలో హాజరు కావడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.