SS: పెనుకొండ(మం) శెట్టిపల్లిలోని శ్రీరామస్వామి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీ సత్యసాయి జిల్లా దూదేకుల నూర్భాషా సంఘం అధ్యక్షులు, మాజీ కన్వీనర్ సిద్దయ్య రూ.10,000 విరాళం అందజేశారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయంగా ఈ మొత్తాన్ని శనివారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తి కావాలని ఆయన ఆకాంక్షించారు.