PPM: ఏపీ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణను మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయనగరంలోని బొత్స నివాసానికి వెళ్లిన ఆయన, మాజీ మంత్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు సమాచారం.