AP: విశాఖలో నిర్వహించిన సీఐఐ వార్షిక సదస్సుకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. విమానయానరంగంపై యుద్ధం ప్రభావం పడుతోందని తెలిపారు. రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం జరుగుతోందన్నారు. కేకేలైన్ కోసం చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. జూన్లో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం కానుందని ప్రకటించారు.