SRCL: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారిని మల్టీ జోన్–1 ఐజీపీ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐజీపీకి ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మండపంలో అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి స్వామివారి శేషవస్త్రం కప్పిప్రసాదాన్ని అందజేశారు.